Tamanna Bhatia : తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “ఓదెల 2” చిత్రీకరణ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. 2021లో విడుదలై సూపర్ హిట్ అయిన “ఓదెల రైల్వే స్టేషన్” చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నారు. సంపత్ నంది రచించిన కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి డి. మధు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న కీలక యాక్షన్ ఘట్టాలను చాలా భారీగా తీస్తున్నట్లు తెలుస్తోంది. భావోద్వేగాలు, థ్రిల్లింగ్ అంశాలు, అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం ప్రేక్షకుల్ని అలరించడం ఖాయమని సినీ వర్గాల అభిప్రాయం. ఈ చిత్రం కోసం తమన్నా ప్రత్యేక యాక్షన్ శిక్షణ కూడా తీసుకుని సన్నద్ధమయ్యారని సమాచారం. సౌందర్‌రాజన్‌.ఎస్ ఛాయాగ్రహణం, అజనీష్‌ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.

Leave a comment

error: Content is protected !!