Tollywood : టాలీవుడ్ ఎల్లప్పుడూ కొత్త ప్రయత్నాలకు నిలయం. ‘స్వీటీ నాటీ క్రేజీ’ చిత్రం అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ చిత్రం టైటిల్‌కి తగ్గట్టుగా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. త్రిగుణ్, శ్రీజిత ఘోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఘనంగా ప్రారంభమైంది. బుధవారం నాడు అతిథుల సమక్షంలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అరుణ్ విజువల్స్ బ్యానర్‌పై ఆర్. అరుణ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాజశేఖర్.జి దర్శకత్వం వహిస్తున్నారు.

హీరో త్రిగుణ్ మాట్లాడుతూ, ఈ చిత్రం తనకు ఇంతకు ముందు వచ్చిన కామెడీ చిత్రాల సక్సెస్‌ను కొనసాగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరుణ్ విజువల్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తెరకెక్కుతుండటం తనకు ఎంతో ఆనందంగా ఉందని, దర్శకుడు రాజశేఖర్.జి తన దృష్టిని ఎంతగా ప్రభావితం చేశారో చెప్పారు. శ్రీజిత, ఇనయ వంటి నటీమణులతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

సీనియర్ నటుడు రఘుబాబు మాట్లాడుతూ, ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతుండటం విశేషమని, తమిళంలో తన పాత్రను రవి మరియ పోషిస్తున్నారని తెలిపారు. త్రిగుణ్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a comment

error: Content is protected !!