అందమైన అభినయం.. అభినయానికి తగ్గ అందం ఆమెది. ఆమె సరసన నటించడం ఒక ప్రివిలేజ్ అని ఫీలవుతారు సౌత్ స్టార్ హీరోలు. ఆమె తెరమీద కనిపించి చిరునవ్వు నవ్వితే చాలని భావిస్తారు అభిమానులు. కథానాయికగా అడుగుపెట్టినప్పటి నుంచీ ఇప్పటి వరకూ అదే అందంతో .. అదే చెక్కుచెదరని చిరునవ్వుతో సౌత్ జనాన్ని మంత్ర ముగ్ధుల్ని చేస్తోన్న ఆ సుందరి అనుష్క శెట్టి. ఆమె దక్షిణాది ప్రేక్షకులకు ఎప్పుడూ స్వీటీనే. ఈ  ఏడాదికి  అనుష్క టాలీవుడ్ లోకి అడుగుపెట్టి అప్పుడే  15 ఏళ్ళు పూర్తి కానుంది.  

2005 లో పూరీ జగన్నాథ్ , నాగార్జున కలయికలో వచ్చిన  ‘సూపర్’ చిత్రం తో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అందాల అనుష్క శెట్టి. అందులో ఆమె గ్లామరస్ అభినయం ప్రేక్షకులకు ఎంతో కిక్కునిచ్చింది. ఆపై టాలీవుడ్ లోని టాప్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ తర్వాత క్రమేణా ఆమె .. హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. ‘అరుంధతి’ చిత్రంలో జేజమ్మగానూ, ‘బాహుబలి’ సిరీస్ లో దేవసేన గానూ, ‘పంచముఖి’ గానూ, భాగమతి గానూ ఇలా పలు ప్రత్యేక చిత్రాల్లో  అభినయించి ప్రేక్షకుల్ని అలరించిన అనుష్క.. ప్రస్తుతం ‘నిశ్శబ్దం’ అనే థ్రిల్లర్ మూవీలో మూగ, బధిర యువతిగా నటిస్తోంది. ఏప్రిల్ 2న విడుదల కానున్న ఇది అనుష్క కెరీర్ లోనే ప్రత్యేకచిత్రం కాబోతోంది. టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు పూర్తికానున్న సందర్భంగా అనుష్కకి అభినందనలు తెలుపుతోంది మూవీ వాల్యూమ్.  

 

Leave a comment

error: Content is protected !!