Suryaprathap Palnati : కుమారి 21 ఎఫ్, 18 పేజీస్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ దర్శకుడు సూర్య ప్రతాప్ ఇప్పుడు బాలీవుడ్ లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న సూర్య ప్రతాప్ తన గురువు అండదండలతో ఇప్పటివరకు రెండు సినిమాలు చేసి మెప్పించాడు.

అయితే తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం సూర్య ప్రతాప్ ముంబైలో ఉన్నాడని తెలుస్తోంది. అక్కడ ఓ బాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి సంప్రదింపులు జరుపుతున్నాడని టాక్. ఆ హీరో ఎవరో కాదు టైగర్ ష్రాఫ్. ఈ సినిమాకు కనెక్ట్ మీడియా సంస్థ నిర్మాతగా వ్యవహరించనుంది. టైగర్ ష్రాఫ్ తో సూర్య ప్రతాప్ సినిమా ఖాయమైతే, అది బాలీవుడ్ లోనే మొదటి సినిమా అవుతుంది.

అయితే ఈ ప్రాజెక్ట్ వెనుక సుకుమార్ హస్తం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. కుమారి 21 ఎఫ్, 18 పేజీస్ సినిమాలు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లోనే నిర్మితమయ్యాయి. సుకుమార్ ఆ సినిమాలకు రచనలో సహాయం చేశాడు. మరి ఈ సినిమా విషయంలోనూ సుకుమార్ ఎలాంటి పాత్ర పోషిస్తాడో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!