Tollywood : కోలీవుడ్ లో రీసెంట్ గా సూపర్ హిట్టయిన చిత్రం ‘గరుడన్’. శశికుమార్, ఉన్నిముకుందన్, సూరి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా వెట్రిమారన్ కథతో తెరకెక్కింది. ఈ సినిమా తెలుగు స్క్రీన్‌పైకి రాబోతుంది. ఈ రీమేక్‌లో మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కలిసి నటించనున్నారు. ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్‌ శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

‘నాంది’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్న విజయ్ కనకమేడల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాకి ‘గరుడ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.  ఈ ముగ్గురు హీరోలు ఒకే సినిమాలో కలిసి నటించడం ఇదే తొలిసారి కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరింత వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ కొత్త కలయిక సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!