లాక్‌డౌన్ వ‌ల‌న దాదాపు మూడు నెల‌లుగా సినిమాలతో పాటు సీరియ‌ల్స్, షోస్‌కి సంబంధించిన‌ షూటింగ్స్ అన్నీ రద్దయ్యాయి. ఇటీవ‌ల ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన స‌డ‌లింపుల‌తో సీరియ‌ల్స్‌, రియాలిటీ షోస్ షూటింగ్ జ‌రుపుకుంటున్నాయి. అయితే లాక్‌డౌన్‌ను ఎత్తివేశాక మెగాస్టార్ చిన్నల్లుడు కల్యాణ్ దేవ్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘సూపర్ మచ్చి’  సినిమా షూటింగ్ ఇటీవల  రామానాయుడు స్టూడియోస్‌లో పునఃప్రారంభ‌మైంది.

పులి వాసు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.  హీరో హీరోయిన్లు క‌ల్యాణ్‌దేవ్‌, ర‌చితా రామ్‌తో పాటు ఒక కీల‌క పాత్ర చేస్తున్న అజ‌య్‌పై కొన్ని ప్ర‌ధాన స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.  క‌రోనా గైడ్‌లైన్స్ పాటిస్తూ షూటింగ్ జరిపామ‌ని చిత్ర బృందం తెలియ‌జేసింది. తాజా షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ మొత్తం పూర్త‌వుతుంది. మ‌రోవైపు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను కూడా నిర్వ‌హిస్తున్నామ‌ని చిత్ర బృందం తెలిపింది.

 

Leave a comment

error: Content is protected !!