శ్రీరంగనీతులు.. ఈ టైటిల్‌తో 1983 లో ఓ సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు, శ్రీదేవి, విజయశాంతి లెజెండ్స్ ఈ సినిమాలో నటించి నవ్వించారు చిన్నపాటి సందేశంతో అలరించారు. ఇప్పుడు అదే టైటిల్‌తో మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టింది రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌..

వీఎస్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్‌ డైరెక్షన్‌లో సుహాస్‌, కార్తీక్‌రత్నం, రుహానీశర్మ,విరాజ్‌ అశ్విన్‌లు మెయిన్‌లీడ్‌తో రాబోతున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసింది చిత్ర యూనిట్‌. ఏప్రిల్‌ 12 న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్‌ చేస్తున్నట్టు అనౌన్స్‌ చేసారు. ఫ్యామిలీ వేల్యూస్, యూత్ ఆలోచనలు, ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్ ఇలా విందు భోజనంలా అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా అవుతుందంటున్నారు.

సినిమాలోని కథ పాత్రలతో ఆడియెన్స్ ప్రయాణించేలా.. మన కథల్ని మనకే పరిచయం చేస్తూ.. సన్నివేశాలతో ప్రేక్షకుల్ని లీనం చేస్తూవాడుక మాటలతో పలకరిస్తూ సాగే సినిమాలు అరుదుగా వస్తుంటాయి.అందులో ఈ శ్రీరంగనీతులు ఒకటి కాబోతుందంటున్నారు మేకర్స్‌.

Leave a comment

error: Content is protected !!