కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది. పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి. దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. కొందరు బొమ్మలు గీసుకుంటున్నారు. కొందరు ఇష్టమైన సినిమాలు చేస్తూ క్వారంటైన్ టైమ్ ను సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే కొందరు మాత్రం మాస్కులు ఎలా తయారు చేయాలో చెబుతున్నారు.

మాస్క్ లు తయారు చేస్తున్న విధానాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. మీరు కూడా ఇలా మాస్కులు తయారు చేసుకోండి అని తెలుపుతున్నారు. ఆ మధ్య నటుడు రవిబాబు షాక్స్‌ని మాస్క్‌గా ఎలా తయారు చేసుకోవచ్చో చూపించారు. రీసెంట్‌గా మంచు విష్ణు కూడా తన పాత టీషర్ట్‌తో మాస్క్ ఎలా తయారు చేసుకున్నాడో చెప్పాడు. ఇప్పుడు మరో హీరో సుధీర్ బాబు కూడా తన టీషర్ట్‌తో మాస్క్‌ని తయారు చేసుకుని ఇప్పుడిదే ముఖ్యం అని అందరికీ చెప్పే ప్రయత్నం చేశారు ‘‘ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు కావాల్సింది టీషర్ట్ కాదు.. మాస్క్. మీరు కూడా తప్పని సరిగా టీ షర్ట్ మరియు మాస్క్ ధరించేలా చూసుకోండి..’’ అని సుధీర్ బాబు ట్వీట్ చేస్తూ తన టీషర్ట్‌ని మాస్క్‌గా ఉపయోగించుకున్న ఫొటోని షేర్ చేశారు.

Leave a comment

error: Content is protected !!