ప్రస్తుతం మన దేశం లాక్ డౌన్ లో ఉన్న సంగతి తెలిసిందే.  ఉభయ తెలుగు రాష్ట్రాలూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలకు అనుగుణంగా దాన్ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాయి. దాని పర్యవసానంగా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి .. వీధిన పడ్డారు. వారిని ఆదుకోవడానికే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వరయంలో అవతరించింది సిసిసి . ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు విరివిగా విరాళాలిచ్చారు. ఇప్పుడు ఆ లిస్ట్ లోకి ఘట్టమనేని వారి అల్లుడు సుధీర్ బాబు కూడా చేరిపోయాడు.

కరోనా వల్ల ఉపాధి కోల్పోయి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న సినీ కార్మికులను ఆదుకునేందుకు యువ కథానాయకుడు సుధీర్‌బాబు ముందుకొచ్చారు. సోమవారం తన జన్మదినం సందర్భంగా ‘కరోనా క్రైసిస్‌ ఛారిటీ’ కి రూ.1లక్ష ఆర్థిక సాయం అందించాడు. ఇక సుధీర్‌ పుట్టినరోజు కానుకగా ‘వి’ చిత్ర బృందం ఆయన కొత్త లుక్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో పోలీస్‌ అధికారిగా కండలు తిరిగి ఉన్న దేహంతో సుధీర్‌బాబు ఆకట్టుకునేలా కనిపించారు. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రంలో.. నాని విలన్  పాత్రను పోషించారు. మోహనకృష్ణ ఇంద్రంటి దర్శకత్వం దర్శకత్వం వహించాడు. నివేదా థామస్, అదితీరావ్‌ హైదరీ కథానాయికలు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తయిన ఈ చిత్రం.. కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది.

Leave a comment

error: Content is protected !!