Sudha kongara : ప్రస్తుతం బాలీవుడ్‌లో ‘సర్ఫిరా’తో బిజీగా ఉన్న దర్శకురాలు సుధా కొంగర, తన తదుపరి చిత్రం గురించి ఉత్సుకత రేపుతోంది. ‘సర్ఫిరా’ జులై 12న విడుదల కానుండగా.. ఆమె తదుపరి ప్రాజెక్ట్ ప్రోసెస్ లో ఉంది. కొంతకాలం క్రితం, సుధా సూర్యతో ‘పురాణనూరు’ అనే చిత్రం చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ప్రారంభం కాలేదు.

తాజా సమాచారం ప్రకారం, సుధా తన తదుపరి చిత్రంలో ధనుష్‌తో కలిసి పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై చర్చలు జరుగుతున్నాయని, సూర్యతో చేయాల్సిన కథనే ధనుష్‌తో మళ్లీ చేయడానికి అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ‘సర్ఫిరా’ విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు. ధనుష్‌ ప్రస్తుతం ‘రాయన్’ చిత్రంలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ చిత్రంలోనూ నటిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!