మ‌హామ్మారి కరోనా పై యావ‌త్ ప్రపంచం యుద్ధం చేస్తోంది. మ‌న దేశంలో కూడా 21 లాక్ డౌన్ ప్ర‌క‌టించి క‌రోనా నివార‌ణ‌కు అన్ని విధాల కార్య‌చ‌ర‌ణ‌లు చేస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు. లాక్ డౌన్ నేప‌థ్యంలో ప్ర‌జ‌లంతా ఇళ్ల‌కే ప‌రిమైత‌న‌ప్ప‌టికీ డాక్ట‌ర్లు, పోలీస్ అధికారులు, హెల్త్ డిపార్ట్ మెంట్ సిబ్బంది పొంచి ఉన్న ప్ర‌మాదాన్ని లెక్క చేయ‌కుండా మ‌నంద‌రి కోసం పని చేస్తున్నారు. ముందుగా వారంద‌రి సుర‌క్ష‌ణ‌ మ‌నంద‌రి ప్ర‌ధ‌మ క‌ర్త‌వ్యం. అందుకే వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖ‌లంతా త‌మ‌కు తోచిన స‌హాయ‌స‌హ‌కారాలు అందిస్తున్నారు.

తెలుగు చిత్ర‌సీమ నుంచి కూడా కొంద‌రు హీరోలు, నిర్మాత‌లు ఇప్ప‌టికే క‌రోనా నివార‌ణ‌కు ముఖ్య‌మంత్రి రిలీఫ్ ఫండ్ కు పెద్ద మొత్తంలో ఆర్ధిక స‌హాకారం అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో శ్రీవిష్ణు కూడా కరోనా నివారణకు తనవంతు సహాయాన్నితాను అందిస్తున్నాడు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మాత తో కలిసి నేడు శ్రీవిష్ణు స్థానిక ప్రజలకు  మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశాడు.

Leave a comment

error: Content is protected !!