Srileela : టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది శ్రీలీల. తన అందం, అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలీవుడ్‌ను కూడా అలరించేందుకు సిద్ధమవుతోంది. తన కెరీర్ ప్రారంభంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్‌లతో కలిసి నటించిన అరుదైన అవకాశాన్ని పొందిన శ్రీలీల, ఇప్పుడు బాలీవుడ్‌ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి నటించబోతోంది. బాలీవుడ్‌లో తన తొలి చిత్రంగా ‘మిట్టి’ అనే చిత్రాన్ని ఎంచుకుంది శ్రీలీల. ఈ చిత్రం యాక్షన్, ఎమోషన్ మరియు ఫ్యామిలీ డ్రామాల కలబోసం. దర్శకుడు బల్వీందర్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

కథానాయిక పాత్ర చాలా బలంగా రాసుకున్నందున శ్రీలీల ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ 2024 నుంచి ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ‘మిట్టి’తో పాటు, ఇబ్రహీం అలీ ఖాన్‌తో కలిసి ‘దిలేర్’ అనే చిత్రంలో కూడా శ్రీలీల నటిస్తోంది. ఈ విధంగా, శ్రీలీల తన కెరీర్‌ను దక్షిణ భారతదేశం వరకు పరిమితం చేసుకోకుండా, బాలీవుడ్‌లో కూడా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

Leave a comment

error: Content is protected !!