సోనూసూద్ ఫేమస్‌ విలన్‌ పాత్రధారి. కానీ కరోనా కాలం సోనూసూద్‌ని హీరోని చేసేసింది. లాక్‌డౌన్‌ టైమ్‌లో సోనూ చేసిన సేవలు ప్రపంచం ముందు హీరోగా నిలబెట్టాయి. గొప్ప మానవతావాదిని పరిచయం చేసింది లాక్‌డౌన్‌ టైమే. అయితే ఇప్పుడు అదే లాక్‌డౌన్‌ సిచ్యుయేషన్‌తో సోనూసూద్‌ హీరోగా ఓ సినిమా రూపొందుతుంది. ఫతే పేరుతో సోనూసూద్‌ హీరోగా.. జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఫీమేల్ లీడ్‌తో వైభవ్‌ మిశ్రా దర్శకత్వంలో శాంతి సాగర్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోంది.
ఓ సినిమాలో హీరో ఉంటాడు విలన్‌ ఉంటాడు. కానీ ప్రపంచమంతటికీ ఒకే ఒక్క విలన్‌ కరోనా భూతం. అలాగే నిత్యం సైబర్‌ నేరగాళ్లతో వ్యవస్థలు ఎంతో క్రైమ్‌ జరుగుతూనే ఉంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో జరిగిన యథార్ధఘటనల స్పూర్తిగా తీసుకుని సైబర్‌ క్రైమ్‌ నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఫతే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ZEE స్టూడియోస్‌ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

ఈ చిత్రం పంజాబ్‌లోని పవిత్ర నగరం అమృత్‌సర్‌ లో ప్రారంభమైంది. ఈ చిత్రం కోసం సోనూసూధ్‌, జాక్వెలిన్‌ లు ఎథికల్‌ హ్యాకర్లచే శిక్షణ పొందారట. ఎన్నో వర్క్‌షాప్‌ల్లో పాల్గొన్నారట. వాస్తవిక సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేకకాదరణ పొందుతుందని నమ్మకం వ్యక్తం చేసారు.ఈ సినిమాకు హాలీవుడ్ టెక్నిషియకన్స్ పని చేయనున్నారట. శరవేగంగా ఈ చిత్రం షూటింగ్ జరుపుకొని ఈ సంవత్సరం చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!