మెగా ఫ్యామిలీ హీరో అల్లు శిరీష్ రెండేళ్ల క్రితం ఊర్వశివో రాక్షసివో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఈ చిత్రం తర్వాత, నిర్మాతలు అల్లు శిరీష్ నటించిన బడ్డీ చిత్రాన్ని ప్రకటించారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు.

అయితే ఈ సినిమాపై ఇప్పటికీ ఎలాంటి అప్‌డేట్ లేదు. దీంతో ప్రేక్షకులు ఈ సినిమా ఒరిజినల్‌ కాదా అని సందేహించారు. అయితే ఎప్పుడో థియేటర్లలోకి రావాల్సిన బడ్డీ సినిమా అనేక కారణాల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.

ఇక లేటెస్ట్ గా మేకర్స్ “బడ్డీ” చిత్రం నుండి మొదటి సింగిల్ “ఆ పిల్ల కనులే” ను విడుదల చేసారుఈ పాట సంగీత ప్రియులను బాగా ఆకట్టుకుంటుంది. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ టెడ్డీ బేర్ కీలక పాత్ర పోషించడం విశేషం.

Leave a comment

error: Content is protected !!