Singham Again : అజయ్ దేవగణ్ హీరోగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన “సింగమ్ అగైన్” చిత్రం దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్, అర్జున్ కపూర్, రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్, దీపికా పదుకొణె తదితర నటీనటులు నటించారు. ముందుగా ఆగస్టులో విడుదల చేయాలని భావించిన ఈ చిత్రం వీఎఫెక్స్ పనుల కారణంగా వాయిదా పడింది. చిత్రబృందం తాజాగా ఓ పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

“అనుకున్న సమయానికి సినిమా వస్తుందని మాకు నమ్మకం లేదు. అందుకే తొందరపడలేదు. ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా సినిమాను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నాము. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయాలని నిర్ణయించుకున్నాము” అని అజయ్ దేవగణ్ తెలిపారు. “సింగమ్” సిరీస్ లో మూడో భాగమైన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభుతాన్ని చూపుతుందో వేచి చూడాలి.

Leave a comment

error: Content is protected !!