Siddhu Jonnalagadda : యూత్ స్టార్ సిద్దు జొన్నలగడ్డ, దర్శకురాలు నీరజ కోన కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న వెరైటీ లవ్ స్టోరీ “తెలుసు కదా” . కొద్ది రోజుల షూటింగ్ తర్వాత, సిద్ధూ ఇతర ప్రాజెక్ట్‌లకు వెళ్లాడు. అందుకే ఈ సినిమాని పక్కన పెట్టినట్లు వార్తలు వచ్చాయి . మేకర్స్ కూడా ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అప్‌డేట్‌లు చేయలేదు. లేటెస్ట్ గా ఇప్పుడు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ చిత్రం షూటింగ్ ఆగష్టు 5 న తిరిగి ప్రారంభమవుతుందని ప్రకటించారు. ‘‘హైదరాబాద్‌లో 30 రోజుల పాటు సాగే షెడ్యూల్ ఇది.

చిత్రీకరణలో ప్రధాన తారాగణం పాల్గొంటారు’’ అని చిత్రబృందం ప్రకటించింది. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రం కోసం సిద్దు జొన్నలగడ్డ అదిరిపోయే మేకోవర్ తో వస్తున్నాడు. వైవా హర్ష కీలక పాత్ర పోషించనున్నారు. థమన్ సంగీత దర్శకుడు.

Leave a comment

error: Content is protected !!