Shruthi Haasan : రీసెంట్ గా ఒక మ్యూజిక్ ఆల్బమ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది శృతి హాసన్. ప్రస్తుతం శ్రుతి సలార్ 2 షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా.. ఒక భారీ యాక్షన్ వెబ్ సిరీస్ లో నటించబోతోందనే వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో చురుకుగా ఉండే శృతి, తాజాగా అభిమానులతో చిట్ చాట్ లో పాల్గొంది. అభిమాని ఒకరు “సౌత్ ఇండియన్ యాస లో ఏదైనా చెప్పండి” అని అభ్యర్థించగా, శృతి హాసన్ ఆసక్తికరంగా రియాక్ట్ అయింది.

“ఈ రకమైన జాతి వివక్షను నేను అసలు సహించను. మమ్ములను ‘ఇడ్లీ, సాంబార్, దోస’ అంటూ పిలిస్తే ఊరుకోము. మీరు మమ్మల్ని ఎప్పటికీ అనుకరించలేరు. మమ్మల్ని అనుకరించడం మీకు సాధ్యం కాదు కనుక, మా లాగా ఉండాలని ట్రై చేయకండి. ఎలా పడితే అలా పిలిస్తే జోక్ గా తీసుకోము. లైట్‌గా అసలే తీసుకోము. సౌత్ ఇండియన్ భాషలో ఏదైనా చెప్పమన్నావు కదా… నోరు మూసుకొని వెళ్లు” అని తమిళ లిపిలో రాసింది.

ఇటీవల కాలంలో ఉత్తరాది వారు, ముఖ్యంగా బాలీవుడ్‌ వారు సౌత్‌ స్టార్స్ ను “ఇడ్లీ, సాంబార్, దోస” అంటూ పిలుస్తున్న నేపథ్యంలో శృతి హాసన్‌ చేసిన వ్యాఖ్యలు, ఇచ్చిన కౌంటర్‌కి అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా సౌత్‌ ఇండియన్‌ ఫ్యాన్స్ ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఈ సంఘటన శృతి హాసన్‌ లోని ధైర్యం, స్పష్టతను బహిర్గతం చేస్తుంది. జాతి వివక్షను ఎదుర్కొన్నప్పుడు గట్టిగా మాట్లాడే ఆమె ధైర్యం ప్రశంసనీయం.

 

Leave a comment

error: Content is protected !!