Shobhitha Dhulipala : రీసెంట్ గా అక్కినేని నాగ చైతన్య, గూఢచారి గాళ్ .. శోభిత ధూళిపాల నిశ్చితార్థ వేడుక అభిమానులను ఉత్సాహంతో నింపింది. ఈ సందర్భంగా శోభిత తన సోషల్ మీడియా ఖాతాలో తమ నిశ్చితార్థం ఫోటోలను పంచుకుంటూ, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తొలి పోస్ట్ పెట్టారు. నాగ చైతన్యను ఉద్దేశించి, “మన పరిచయం ఎలా మొదలైనా, ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి” అని ఎంతో భావోద్వేగంతో రాశారు.

నాగార్జున ఈ జంట నిశ్చితార్థ వార్తను తమ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించడంతో ఈ వార్త క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అభిమానులు ఈ జంట మొదటి సోషల్ మీడియా పోస్టును ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. శోభిత పోస్టును నాగ చైతన్య కూడా రీపోస్ట్ చేయడంతో ఈ జంటపై అభిమానుల ఆశీర్వాదాలు వెల్లువెత్తుతున్నాయి.

సినీ ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాను నింపుతున్నారు. ఈ జంట త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కానున్నందుకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Leave a comment

error: Content is protected !!