Kalki 2898 AD : పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం “కల్కి 2898 AD”. ఈ సినిమా మరో 8 రోజుల్లో, జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ద్వారా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ చురుకుగా పాల్గొంటూ ఉండడంతో, సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. తాజాగా, చిత్రంలో ఒక కీలక పాత్రను మేకర్స్ పరిచయం చేశారు. నటి శోభన “మరియమ్” అనే పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిపే పోస్టర్ ను విడుదల చేశారు. “ఆమెలాగే తన పూర్వీకులు కూడా ఎదురుచూశారు..” అనే ట్యాగ్ లైన్ తో వచ్చిన ఈ పోస్టర్, ఆమె పాత్ర ఏమిటో అనే ఆసక్తిని మరింత పెంచింది.

ఈ చిత్రంలో ప్రభాస్ అత్యంత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని, మృణాల్ ఠాకూర్ తదితర నటీనటులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a comment

error: Content is protected !!