Tollywood : ప్రముఖ రచయిత, దర్శకుడు జనార్ధన మహర్షి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంస్కృత చిత్రం ‘శ్లోక’ ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఈ చిత్రం జనార్ధన మహర్షి కుమార్తెలు శ్రావణి, శర్వాణిలు నిర్మించారు. హీరోయిన్ రాగిణి ద్వివేది ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

‘శ్లోక’ చిత్రంలో రాగిణి ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తున్నారు. ఆమె రుధ్రభూమి (స్మశానం) లోకి వెళ్లి ప్రకృతితో మాట్లాడుతూ ఉండే యువతిగా కనిపిస్తారు. ఈ పాత్ర కోసం, రాగిణి దేశంలోనే పురాతనమైన అనేక స్మశానాలలో షూటింగ్ చేశారు. ఈ స్మశానాల ప్రత్యేకత ఏమిటో సినిమా చూస్తేనే తెలుస్తుందని దర్శకుడు తెలిపారు.

‘శ్లోక’ చిత్రం సంస్కృత భాషలో తెరకెక్కుతున్నప్పటికీ, అనేక భారతీయ భాషల్లో డబ్బింగ్ చేయబడుతుంది. దర్శకుడు జనార్ధన మహర్షి సంస్కృత భాషను ప్రపంచ ప్రసిద్ధం చేయాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని తీస్తున్నారు. సెప్టెంబర్ 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని సంస్కృత ఉపాధ్యాయులకు అంకితమిస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.

 

 

Leave a comment

error: Content is protected !!