నేను నార్మల్ గా ఎవరి జోలికి వెళ్ళను ఒడిపోతాననే భయం కాదు….
నేను వెళితే రణరంగం మారణహోమంగా మారుతుంది..” ఈ డైలాగ్ అప్‌కమింగ్ మూవీ ఘోస్ట్ మూవీ లోనిది. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ మూవీ అక్టోబర్‌ 19 న ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ట్రైలర్‌ లాంచ్‌ చేసారు. సంగీత దర్శకుడు అర్జున్ జన్య అందించిన సంగీతం యాక్షన్ సీన్స్ ను మరో స్థాయికి తీసుకెళ్లింది. వింటేజ్ శివన్న యంగ్ గా కనబడే షాట్స్ ఫ్యాన్స్ కి ఫీస్ట్ గా ఉండనున్నాయి. ట్రైలర్ ఘోస్ట్ మీద ఉన్న అంచనాలను తారాస్థాయికి తీసుకెళ్లింది.

. ప్రముఖ నటులు అనుపమ్ ఖేర్, జయరామ్, ప్రశాంత్ నారాయణ్, అర్చన జాయిస్, సత్య ప్రకాష్, దత్తన్న ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. ‘ఘోస్ట్’ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. మస్తీ, ప్రసన్న వి ఎం డైలాగ్స్ రాస్తున్నారు.

దర్శకుడు శ్రీని ఘోస్ట్ చిత్రాన్ని యాక్షన్ ఫీస్ట్ గా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ రాజకీయనాయకులు, నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఘోస్ట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.

 

Leave a comment

error: Content is protected !!