Border : ఐకానిక్ వార్ ఫిల్మ్ ‘బోర్డర్’ సినిమా విడుదలై నేటికి 27 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ సినిమాలో నటించిన సన్నీ డియోల్ అండ్ టీమ్.. ఈ మూవీ సీక్వెల్ .. బోర్డర్ 2 రాబోతున్నట్టు అద్భుతమైన ప్రకటనతో అభిమానుల్ని ఖుషీ చేశారు.

జేపీ దత్తా దర్శకత్వంలో  రూపొందిన ఈ సినిమా మూడు జాతీయ అవార్డులు గెలుచుకుంది. ఇంక ఈ చిత్రానికి సీక్వెల్.. మొదటిభాగంలోని ప్రధాన పాత్ర ధారుల పూర్వీకుల బ్యాక్ గ్రౌండ్ ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకొని, ప్రేక్షకులకు మరపురాని సినిమా అనుభూతిని అందించబోతోంది.

సన్నీ డియోల్ తన సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ఈ ఎక్సయిటింగ్ న్యూస్ ను పంచుకుని, అభిమానులలో ఆసక్తిని రేకెత్తించాడు. ఈ ప్రాజెక్ట్‌లో ఆయుష్మాన్ ఖురానా ఎంట్రీ ఉంటుందని వార్తలొస్తున్నాయి. భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, జేపీ దత్తా , నిధి దత్తా నిర్మించబోతున్నారు.

Leave a comment

error: Content is protected !!