Tollywood : లక్ష్మణ మూర్తి రతన, భ్రమరాంబిక ప్రధాన పాత్రల్లో రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన చిత్రం ‘సీతారాం సిత్రాలు’. డి. నాగేంద్ర రెడ్డి, కృష్ణ చంద్ర విజయబట్టు నిర్మాతలుగా, డి. నాగ శశిధర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులను అలరించేలా రూపొందించబడింది. ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం యొక్క గ్రాండ్ ట్రైలర్‌ను నటుడు ఆకాష్ జగన్నాథ్ విడుదల చేశారు.

తెలుగు ప్రేక్షకులు సినిమా నచ్చితే తమ భుజాలపై వేసుకుని ముందుకు తీసుకెళ్తారు. ఈ చిత్రం కూడా అందరికీ నచ్చి పెద్ద విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నాను అని ఆకాష్ జగన్నాథ్ అన్నారు. ఈ చిత్రానికి మారుతి, విశ్వక్సేన్, సందీప్ కిషన్, కార్తికేయ వంటి వారు మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం అని నిర్మాతలు అన్నారు.

ఈ సినిమా కోసం మేము చాలా ఇష్టపడి పని చేశాం. ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము అని హీరోయిన్ భ్రమరాంబిక అన్నారు. ఈ సినిమా కోవిడ్ కాలంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రేక్షకులకు స్ట్రెస్ రిలీఫ్‌గా ఉంటుందని నమ్ముతున్నాను అని దర్శకుడు డి. నాగ శశిధర్ రెడ్డి: ఈ సినిమా చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మా ప్రొడ్యూసర్లు మరియు దర్శకుడికి కృతజ్ఞతలు అని హీరో లక్ష్మణ మూర్తి రతన అన్నారు.

Leave a comment

error: Content is protected !!