Sarvanand : శర్వానంద్ ప్రస్తుతం తన రాబోయే చిత్రం “మనమే” ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా జూన్ 7, 2024న థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అయింది. ఇదిలా ఉంటే.. శర్వానంద్ దర్శకుడు సంపత్ నందితో కలిసి రాబోయే సినిమాలో నటించే అవకాశం ఉందని, ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే అవకాశం ఉందని సమాచారం.

సంపత్ నంది ప్రస్తుతం తమన్నా భాటియా ప్రధాన పాత్రలో “ఒదెల 2” నిర్మాణంలో బిజీగా ఉన్నాడు. అలాగే సాయి ధరమ్ తేజ్‌తో “గాంజా శంకర్” అనే సినిమా హడావిడిలో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాత శర్వానంద్ సినిమా సెట్స్ పైకి వెళుతుంది. స్ట్రాంగ్ కంటెంట్ తో సినిమాలు తీసే సంపత్ నంది విలక్షణ పాత్రలతో మెప్పించే శర్వానంద్ తో కొలాబరేట్ అవుతున్నాడు. మరి ఈ ఇద్దరి కలయికలో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

 

Leave a comment

error: Content is protected !!