బాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదాల పరంపర కొనసాగుతునే ఉంది. ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ల వరుస మరణాలు ప్రేక్షకుల్ని శోకసంద్రంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. అవి ఇంకా మరువక ముందే .. మరో బాలీవుడ్ ధ్రువతార నేలరాలింది. ప్రముఖ కొరియో గ్రాఫర్ సరోజ్ ఖాన్ (71) నేడు ముంబైలో తుదిశ్వాస విడిచారు . శ్వాస సంబంధిత సమస్యల తో ముంబై బాంద్రా లోని గురునానక్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సరోజ్ ఖాన్ అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతం లో గుండె పోటు తో కన్ను మూశారు.

1975లో మౌసమ్ సినిమాతో బాలీవుడ్ కొరియోగ్రాఫర్ అయ్యారు. దాదాపు నాలుగు దశాబ్ధాల పాటు బాలీవుడ్ సహా పలు పరిశ్రమలకు కొరియోగ్రాఫర్ గా తన సేవలందించారు. ఉత్తమ కొరియోగ్రాఫర్ గా మూడుసార్లు జాతీయ అవార్డులు అందుకున్నారు. డోలా రె డోలా (దేవ్దాస్).. ఏ ఇష్క్ హాయే (జబ్ వి మెట్).. మణికర్ణిక.. తను వెడ్స్ మను రిటర్న్స్ సహా పలు బ్లాక్ బస్టర్లకు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ అందించారు. సరోజ్ ఖాన్ కి తెలుగు సినీపరిశ్రమలోనూ వీరాభిమానులున్నారు. ఆమె పలు తెలుగు చిత్రాలకు కొరియోగ్రఫీ అందించారు. సరోజ్ ఖాన్ మరణానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం తెలియజేశారు.

 

 

 

 

Leave a comment

error: Content is protected !!