Nani : నేచురల్ స్టార్ నాని , వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘సరిపోదా శనివారం’ తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. హైదరాబాద్‌లో వైభవంగా జరిగిన ఈ ఈవెంట్‌లో నటీనటులు , చిత్ర బృందం పాల్గొని సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశారు. సాధారణ మధ్యతరగతి యువకుడు సూర్య (నాని) తన చుట్టూ ఉన్నవారికి అన్యాయం జరిగితే సహించలేని వ్యక్తి. సిఐ దయానంద్ (వివేక్ ఆత్రేయ) చిన్న చిన్న కారణాలతో ఇతరులపై దాడి చేసే క్రూరమైన వ్యక్తి. ఈ ఇద్దరి మధ్య జరిగే తీవ్రమైన సంఘర్షణే కథ.

నాని తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రియాంక మోహన్ కానిస్టేబుల్ పాత్రలో ఆకట్టుకున్నారు. మురళి జి సినిమాటోగ్రఫీ, జేక్స్ బిజోయ్ సంగీతం, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చిత్రానికి మరింత బలం చేకూర్చాయి. డివివి దానయ్య నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది.

సుదర్శన్ థియేటర్ నాకు చాలా ప్రత్యేకం. మీ అందరితో కలిసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా వుంది. ఈ మంత్ ఎండ్ కి అదిరిపోతుంది. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను అని నానీ అన్నారు. ట్రైలర్ కి మించి సినిమా వుంటుంది. సినిమా సూపర్ గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నాని గారు కష్టపడి వచ్చారు. అని యస్ జే సూర్య అన్నారు. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవడం ఆనందంగా వుంది. నాని గారితో గ్యాంగ్ లీడర్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఆగస్ట్ 29న అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి అని ప్రియాంకా మోహన్ అన్నారు. నాని యాక్షన్ అవతారం, వివేక్ ఆత్రేయ విలన్ పాత్ర, మరియు భారీ బడ్జెట్ విలువలు ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఆగస్ట్ 29న విడుదల కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో విజయం సాధిస్తుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!