యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలుగు సినిమాలో నటించి ముడేళ్ళయిపోయింది. లాస్టియర్ ఛత్రపతిలో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ మూవీ ఫెయిల్ అవడంతో.. మళ్లీ తెలుగు సినిమాలపై దృష్టి సారించాడు శ్రీనివాస్. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. అందులో ఒక చిత్రాన్ని మూన్‌షైన్ పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.

విరూపాక్ష, భీమ్లా నాయక్ ఫేమ్ సంయుక్త మీనన్ ఈ చిత్రంలో కథానాయికగా ఫిక్సయిపోయింది. ఆమె కొన్ని రోజుల క్రితం ఈ సినిమా కోసం సైన్ చేసినట్టు సమాచారం. సోషియో ఫాంటసీ డ్రామాగా రూ.50 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందనుంది.

ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. లుధీర్ బైరెడ్డి అనే నూతన దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.

Leave a comment

error: Content is protected !!