తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం- రజాకార్ల నేపథ్యంలో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా డైరెక్టర్ సంపత్ నంది ఓ కథను సిద్ధం చేసుకున్నాడట. ఈ సినిమాను చిరంజీవి హీరోగా తెరకెక్కించాలనీ భావిస్తున్నాడట. అందులో భాగంగా సంపత్ నంది త్వరలోనే చిరంజీవికి వినిపించడానికి సిద్ధమవుతున్నాడని టాక్. ఈ విషయాన్ని సంపత్ నంది తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ వెల్లడించాడు. ఆయన ప్రస్తుతం గోపీచంద్ హీరోగా ఆయన ‘సీటీమార్’ సినిమా చేస్తున్నాడు. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తోన్న సినిమాను శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌కి కోచ్‌గా చేస్తుంటే.. తమన్నా తెలంగాణ ఫీమేల్‌ కబడ్డీ టీమ్‌ కోచ్‌గా చేస్తోంది. ఈ మూవీలో మిల్కీబ్యూటి తమన్నాతో పాటు మరో హీరోయిన్‌గా హిప్పీబ్యూటీ దిగంగన సూర్యవంశీ నటిస్తోంది. మరో కీలక పాత్రలో భూమిక నటిస్తోంది.

ఎంతోకాలం నుంచి చిరంజీవిని డైరెక్ట్‌ చేయాలనుకుంటున్నానని, తెలంగాణ రజాకార్ల నేపథ్యంలో కథ రూపొందించబోతున్నట్లు తన మనసులో మాట పంచుకున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్టులు ఎప్పుడు మొదలవుతాయో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిదే. ‘ఏమైంది ఈ వేళ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యారు సంపత్‌. ‘రచ్చ’, ‘బెంగాల్‌ టైగర్‌’, ‘గౌతమ్‌ నంద’ చిత్రాలతో మాస్‌ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

Leave a comment

error: Content is protected !!