లాక్ డౌన్ పుణ్యమా అని..  ఇంట్లో ఖాళీ గా ఉన్న సినీ సెలబ్రిటీస్ వివిధ రకాల వ్యాపకాలతో  సోషల్ మీడియా ద్వారా అభిమానులకు మరింత దగ్గరయ్యారు. ఖాళీ సమయాల్లో వారు చేస్తోన్న పనులతో , నేర్చుకుంటోన్న కొత్త విషయాలతో తన ఇమేజ్ ను మరింతగా  పెంచుకొనే పనిలో పడ్డారు. నిన్నటికినిన్న అక్కినేని వారి కోడలు సమంతా.. ఇటీవల  తన పెట్ తో దిగిన ఫొటోలతో పాటు.. భర్త నాగ చైతన్యతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక తాజాగా  సమంత తన వెజిటబుల్ గార్డన్ ను అభిమానులకు పరిచయం చేసింది. అర్బన్ కిసాన్ వారితో కలిసి తన ఇంటి టెర్రస్ మీద వెజిటబుల్ గార్డెన్ ను ఏర్పాటు చేసింది. సేంద్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేస్తున్న సమంత ఆర్గానిక్ పద్ధతిలో వెజిటబుల్స్ పండించడం నేర్చుకున్నది. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. కాగా ప్రస్తుతం ఈ ఫోటోస్ వైరల్ గా మారాయి.

Leave a comment

error: Content is protected !!