Saipallavi :  సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో ‘తండేల్‌’ చిత్రంతో పాటు, హిందీలో రెండు భారీ ప్రాజెక్ట్‌లు, తమిళంలో ‘అమరన్‌’ చిత్రంలో నటిస్తోంది. ఈ బిజీ షెడ్యూల్ మధ్యలో మరో కొత్త సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. విజయ్‌ దేవరకొండ హీరోగా రవికిరణ్‌ కోలా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

అందమైన ప్రేమకథతో రూపొందుతున్న ఈ చిత్రం రూరల్‌ మాస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి నాయికగా సాయిపల్లవిని ఖరారు చేసేందుకు చిత్ర బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో కథా చర్చలు జరిగాయని, సినిమా విషయంలో ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సాయిపల్లవి ఈ సినిమాలో నటిస్తే, ఇది ఆమె కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుంది.

Leave a comment

error: Content is protected !!