Saidurga tej : సాయి దుర్గా తేజ్‌ హీరోగా ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్‌ వేగంగా సాగుతోంది. రోహిత్‌ దర్శకత్వంలో కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌ ఫిల్మ్‌సిటీలో షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాలోని కీలకమైన పోరాట దృశ్యాలు ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నాయి. అడవి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్‌ సన్నివేశాలను సాయితేజ్‌ తదితరులపై ప్రముఖ యాక్షన్‌ కోరియోగ్రాఫర్‌ రామ్‌లక్ష్మణ్‌ మాస్టర్‌ శిక్షణ ఇస్తున్నారు. ఈ ఫైట్‌ సీన్‌ చిత్రానికి హైలైట్‌గా నిలవనున్నట్లు చిత్రబృందం తెలిపింది.

సాయి దుర్గా తేజ్‌ కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏపీ మైనింగ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమా కేజీఎఫ్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ స్టోరీతో ప్రేక్షకులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే సాయి ధరమ్‌ తేజ్‌ తన పేరును సాయి దుర్గా తేజ్‌గా మార్చుకున్న సంగతి తెలిసిందే. తన తల్లి పేరు అయిన ‘దుర్గ’ను తన పేరులో చేర్చుకోవడం ద్వారా తల్లి ఎప్పుడూ తనతోనే ఉంటుందనే భావనను వ్యక్తం చేశారు.

ఈ సినిమాకు ‘సంబరాల ఏటి గట్టు’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేసినట్లు తెలుస్తోంది. పీరియడ్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. హనుమాన్‌ మూవీతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టిన నిర్మాత కె.నిరంజన్‌ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో సాయి దుర్గా తేజ్‌ కెరీర్‌లో మరో మైలురాయి సృష్టిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!