“ప్రజాస్వామ్యం’ అంటే కేవలం ఓటు హక్కో, అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం. కానీ కట్టకుండానే కూలిపోతున్న వ్యవస్థలే ఆ ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఆ ఫ్యూడల్‌ వ్యవస్థలోనే బతుకుతున్నాం” అంటూ సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా పొలిటికల్‌ కథాచిత్రంగా దేవ్‌కట్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రిపబ్లిక్‌’. ఈ చిత్ర టీజర్ ను విడుదల చేసింది మూవీ బృందం.  పొలిటికల్‌ కథాంశంతో రూపొందిన సినిమాలో సాయిధరమ్‌ తేజ్‌ కు జోడిగా ఐశ్వర్యా రాజేశ్‌ నటిస్తుంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.  జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, జీస్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సినిమా జూన్‌ 4న ఈ ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave a comment

error: Content is protected !!