Rojapoolu Sriram : ఒకరికి ఒకరు, రోజాపూలు, స్నేహితులు, రాగల 24 గంటల్లో వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించిన హీరో శ్రీరామ్. అతడు నటించిన సరికొత్త చిత్రం “కోడి బుర్ర”. ఈ సినిమా తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ లోని దైవ సన్నిధానంలో ప్రారంభమైంది.

ఈ చిత్రాన్ని వీ4 క్రియేషన్స్ బ్యానర్ లో కంచర్ల సత్యనారాయణరెడ్డి, గట్టు విజయ్ గౌడ్, చిన్ని చందు, వట్టం రాఘవేంద్ర, సముద్రాల మహేశ్ గౌడ్ కలిసి నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ కానూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతి మీనన్, ఆరుషి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మహావీర్ మరో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు.

ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో అతిథిలుగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి పాల్గొని కెమెరా స్విచ్ఛాన్ చేశారు. నిర్మాత బెక్కెం వేణుగోపాల్ క్లాప్ నివ్వగా, దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ అందించారు.

Leave a comment

error: Content is protected !!