Rithesh Deshmukh : ప్రముఖ బాలీవుడ్ నటుడు, దర్శక నిర్మాత రితేష్ దేశ్‌ముఖ్ మరాఠీ, హిందీ సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. ఇప్పుడు ఆయన డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ‘పిల్‌’ అనే తన తొలి వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సిరీస్‌కు రాజ్‌ కుమార్‌ గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో సిరీస్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు రితేష్ దేశ్‌ముఖ్.

“మీరు వాడుతున్న మందులు ఏమిటి? వాటిని ఎలా తయారు చేస్తారు? వాటి వెనుక ఎలాంటి కుట్రలు దాగున్నాయి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి జులై 12న రాబోతున్న ‘పిల్‌’ వెబ్‌ సిరీస్ చూడండి” అని ఆయన పోస్ట్‌లో రాశారు. ఫార్మా పరిశ్రమలో దాగి ఉన్న రహస్యాలు, చీకటి కోణాలను ఈ సిరీస్ ఛేదించనుంది. రోనీ స్క్రూవాలా ఈ సిరీస్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ‘రైడ్‌ 2’, ‘కాకుడా’ చిత్రాలతో బిజీగా ఉన్న రితేష్‌ ఈ వెబ్‌సిరీస్‌తో డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవాలని భావిస్తున్నారు.

Leave a comment

error: Content is protected !!