Rashmika Mandanna : అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో రష్మిక మందన్న పోషించిన శ్రీవల్లి పాత్ర ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. సీమ యాస, ఆమె అందం, సహజ నటనతో ఆ పాత్రలో ఒదిగిపోయింది రష్మిక. ఇప్పుడు ఆమె మళ్ళీ సీమ యాసలో, పీరియాడిక్ నేపథ్యంలో నటించబోతోంది.

విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందబోతున్న ఓ పీరియాడిక్ డ్రామాలో రష్మిక కథానాయికగా నటించనుంది. ఈ చిత్రం పూర్తిగా రాయలసీమలోని కర్నూలు నేపథ్యంలో సాగుతుంది. సీమ కథ, పీరియాడిక్ నేపథ్యం కావడంతో హీరో, హీరోయిన్ పాత్రలు కూడా ఆ కాలం, ఆ ప్రాంతాన్ని ప్రతిబింబించేలా ఉంటాయని తెలుస్తోంది.

పుష్ప 2 లో శ్రీవల్లి పాత్ర నుండి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ సీమ పాత్రలో ఒదిగిపోతుందని నమ్ముతున్నారు చాలా మంది. ప్రస్తుతం రష్మిక ది గర్ల్‌ఫ్రెండ్‌, కుబేర, సికందర్ తదితర చిత్రాలలో నటిస్తోంది. ఈ కొత్త పీరియాడిక్ డ్రామాలో రష్మిక నటన ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment

error: Content is protected !!