Rashmika Mandanna: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న త్వరలోనే ‘పుష్ప 2’ తో ప్రేక్షకులను మెప్పించనుంది. ఇప్పుడు ఒక సరికొత్త ప్రాజెక్ట్‌తో ఇండియన్ ఆడియన్స్ ను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా ఒక హారర్ కామెడీ చిత్రంలో రష్మిక నటించనుందని తాజా సమాచారం.

ఈ చిత్రానికి దినేష్ విజన్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ‘స్త్రీ’, ‘భేడియా’, ‘ముంజ్యా’ వంటి హారర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దినేష్ విజన్, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడానికి కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. చిత్రానికి ఆదిత్య సత్పోదర్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రానికి ‘వాంపైర్స్ ఆఫ్ విజయ్‌నగర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. మడాక్ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన రానుంది.

Leave a comment

error: Content is protected !!