Rana Daggubati : రానా దగ్గుబాటి చివరిసారిగా పూర్తిస్థాయి హీరోగా నటించిన చిత్రం “విరాట పర్వం”. ఆ తర్వాత ఆయన “స్పై” సినిమాలో ఒక చిన్న అతిథి పాత్రలో కనిపించారు. ప్రస్తుతం రజనీకాంత్‌ సినిమా “వేట్టయాన్‌”లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే, నెట్‌ఫ్లిక్స్‌ కోసం “రానా నాయుడు” సిరీస్‌ రెండో సీజన్‌లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌లో వెంకటేష్ తో మళ్ళీ స్ర్కీన్ షేర్ చేసుకోబోతున్నారు. అయితే తేజ దర్శకత్వంలో అనౌన్స్ అయిన.. ‘రాక్షసరాజు’ సినిమా గురించి మళ్లీ మరో అప్డేట్ రాలేదు.

ఈ నేపథ్యంలో ఇటీవలే రానా ఒక కొత్త సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి కిశోర్ దర్శకత్వం వహించనున్నారు. ఆర్కా మీడియా వర్క్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. కథానాయికగా శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం పూర్వ నిర్మాణ దశలో ఉంది మరియు అక్టోబర్‌లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ సినిమా గురించి మరింత అధికారిక సమాచారం త్వరలోనే రానుంది.

Leave a comment

error: Content is protected !!