మెగాస్టార్ చిరంజీవి ,  రమ్యకృష్ణ జోడీకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘ముగ్గురు మొనగాళ్ళు, అల్లుడా మజాకా, ఇద్దరు మిత్రులు’ లాంటి చిత్రాలు  ప్రజాదరణ పొందాయి. అంతేకాదు.. అంతకు ముందే  ‘చక్రవర్తి’ చిత్రంలో రమ్యకృష్ణ ఆయనకి చెల్లెలిగా కూడా నటించింది. అలాంటి ఈ పెయిర్ టాలీవుడ్ లో సందడి చేసి చాలా కాలమే అయింది. అందుకే మరోసారి మెగాస్టార్ తో నటించాలని ఉందని  రమ్యకృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది సినిమా మాత్రం కాదట. వెబ్ సిరీసట.

ఇటీవల జయలలిత బయోపిక్ క్వీన్ లో టైటిల్ రోల్ ను తనదైన శైలిలో పోషించి  మెప్పించిన శివగామి..  ఇప్పుడు మరో వెబ్ సిరీస్ లో నటించాలనుకుంటోందట. అది కూడా చిరంజీవి తో నటించడం పై ఆసక్తి చూపుతోందట. దీనికి తోడు చిరంజీవి కూడా వెబ్ సిరీస్ లో నటించాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇటీవల కాలంలో వార్తలొచ్చాయి. మరి ఎప్పుడు ఈ ఇద్దరూ వెబ్ సిరీస్ లో జోడీ అవుతారో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!