Ram Pothineni : బోయపాటి శ్రీను సినిమా ‘స్కంద’ పరాజయం పాలవడంతో రామ్ పోతినేని కాస్త స్లో అయ్యాడు. అయితే అతను సరైన కమ్ బ్యాక్ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో అతను ఏ చిత్రానికి అంగీకరించాలి అన్నది కాస్త కన్ఫ్యూజన్ గా మారింది . ప్రెజెంట్ .. “డబుల్ ఇస్మార్ట్” కోసం దర్శకుడు పూరీ జగన్నాధ్‌తో కలిసి పనిచేసినప్పటికీ, నిర్మాణ ఆలస్యం కారణంగా అతను సినిమాపై అసంతృప్తితో ఉన్నాడు. అందుకే త్వరగా రెండు మూడు సినిమాలు చేయాలనుకుంటున్నాడు.

తాజా సమాచారం ప్రకారం అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి నటించిన “మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి” చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు పి మహేష్ బాబుకు రామ్ పోతినేని ఇటీవల గ్రీన్ లైట్ ఇచ్చారు. దర్శకుడు చెప్పిన స్టోరీ ఆయనకు బాగా నచ్చిందని సమాచారం. ఇది త్వరలో ప్రారంభించాలని భావిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

అది పక్కన పెడితే గతంలో తనకు కథలు చెప్పిన హరీష్ శంకర్ వంటి దర్శకులతో కలిసి పనిచేయాలని భావిస్తున్నాడు. అయితే, వీటిలో ఒక ప్రాజెక్ట్ త్వరలో ప్రారంభం కానుంది. మరోవైపు, “డబుల్ ఇస్మార్ట్” విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 2024లో థియేటర్లలోకి రానుంది.

Leave a comment

error: Content is protected !!