కరోనా మహమ్మారి యావత్ ప్రపంచంపై తన పంజా విసిరింది.  పలు దేశాల ప్రజలు దాని బారిన పడ్డారు. ఆ పెను భూతం భారత్ కూ వ్యాపించి .. ఇక్కడ ప్రజల్నీ భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో పలు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొందరు మృత్యువాత కూడా పడ్డారు. అందుకే దాని తీవ్రతను అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. దాంతో రాజు నుంచి బంటు వరకూ .. పేద నుంచి ధనిక వర్గాల వరకూ ఇళ్ళకే పరిమితమయ్యారు. దీని కారణంగా దేశ వ్యాప్తంగా అత్యవసర సేవలు తప్ప మిగతా పరిశ్రమల్ని స్థంభించిపోయాయి.

దీంతో షూటింగ్స్ లేక హీరోలు ఇంటిపట్టునే కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కొంత మంది ఇంట్లో రకరకాల గేమ్స్ ఆడుతున్నారు. మరికొందరు టీవీల్లో తమకు నచ్చిన ప్రోగ్రామ్స్‌తో పాటు సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూస్తున్నారు. ఇంకొందరు మాత్రం తమకు నచ్చిన పుస్తకాలకు దుమ్ము దులిపి ఓ పట్టుపడుతున్నారు. ఇంకొందరు మాత్రం ఎపుడు వంట ఇల్లు ముఖం చూడని వాళ్లు ఇపుడు నల భీములు అయిపోతున్నారు. తాజాగా రామ్ చరణ్ లాక్‌డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీగా ఉండకుండా వంట చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు తాజాగా ఓ వంటకం రెడీ చేసి భార్యకు తినిపించాడు. ఇక రామ్ చరణ్ వంట చేసిన వీడియోను ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఇపుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Leave a comment

error: Content is protected !!