Rajanikanth : సూపర్ స్టార్ రజినీకాంత్ తన అభిమానులను నిరాశపరచకుండా వరుస సినిమాలతో అలరిస్తున్నారు. దసరా బరిలో ‘వేట్టయాన్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన, ప్రస్తుతం లోకేష్ కనగారాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. అంతేకాకుండా ‘జైలర్ 2’ ప్రాజెక్ట్ కూడా పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నది. ఇక, తాజా సమాచారం ప్రకారం రజినీకాంత్, హిట్ చిత్రాల దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతోంది.

‘కర్ణన్’, ‘మామన్నన్’ వంటి విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరించిన మారి సెల్వరాజ్ రజినీకాంత్ తన గత చిత్రాలను చూసి అభినందించారని, వారిద్దరూ కలిసి సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కోసం కథా చర్చలు జరుగుతున్నాయి. మారి సెల్వరాజ్ ప్రస్తుతం ‘వాళై’ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా, ‘బైసన్’ చిత్రం 70% చిత్రీకరణ పూర్తి చేసుకుంది.

Leave a comment

error: Content is protected !!