ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి .. తారక్, చెర్రీతో  మహా మల్టీస్టారర్  రౌద్రం రణం రుధిరం చిత్రాన్ని కంప్లీట్ చేసే ప్రాసెస్ లో ఉన్నాడు.  వచ్చే ఏడాది జనవరి 8న విడుదల  తేదీని కూడా కన్ఫామ్ చేశారు. ఇదిలా ఉంటే..  సూపర్ స్టార్ మహేష్ బాబు తో కూడా  రాజమౌళి సినిమా చేస్తే చూడాలనేది అయన అభిమానుల కోరిక.  చాన్నాళ్ల నుండి వీరిద్దరి కలయిక కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  రాజమౌళి, మహేష్ కూడ తప్పకుండా సినిమా చేస్తామని గతంలో అన్నారు. ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్న వార్తల మేరకు వీరిద్దరూ గత కొన్నాళ్లుగా స్టోరీ లైన్ గురించి చర్చలు చేస్తున్నారని, ఒక లైన్ ను లాక్ చేశారని అంటున్నారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు ప్రభాస్ లతో జక్కన మల్టీస్టారర్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో సారి మహేష్ , రాజమౌళి కాంబినేషన్ తెరపైకి వచ్చింది.

తాజాగా రాజమౌళి  ఓ మీడియాఇంటర్వ్యూలో  మాట్లాడుతూ.. దాన‌య్య సినిమా అయిపోయిన త‌ర్వాత కేఎల్ నారాయ‌ణ నిర్మాణంలో మ‌హేష్ బాబుతో సినిమా ఉంటుంద‌ని ప్ర‌క‌టించాడు జ‌క్క‌న్న‌.దాంతో మహేష్ తో జక్కన్న సినిమా ఫిక్స్ అయిపోయిందని తెలుస్తుంది. ఇక మహేష్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. అటు రాజమోళి కూడా ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ప్రధాన పాత్రల్లో ఆర్ ఆర్ ఆర్‌‌ను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో తెలుగు వీరులు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటిస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో అదరగొట్టనున్నాడు.. మహేష్ తో రాజమౌళి సినిమా ఫిక్స్ అవ్వడంతో మహేష్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

Leave a comment

error: Content is protected !!