SSMB 29 : మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ వరల్డ్ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఈ చిత్రం నుంచి ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. అయితే ఈ చిత్రానికి సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటకు వచ్చాయి. రాజమౌళి మరియు చిత్ర బృందం ఈ సినిమా కోసం సౌతాఫ్రికా వెళ్తున్నారు. అక్కడి అడవుల్లో ఈ చిత్రం ఎక్కువ భాగం చిత్రీకరించాలనే ఆలోచనతో ఉన్నారు. అందుకోసం లొకేషన్ రెక్కీ చేయడానికి వెళ్తున్నారు.

ఈ సినిమాలో విలన్ పాత్రకు విక్రమ్ పేరు వినిపించింది. కానీ విక్రమ్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కాదని స్పష్టం చేశారు. ప్రస్తుతం విలన్ పాత్రకు ఫృధ్వీరాజ్ సుకుమారన్ పేరు తెరపైకి వస్తోంది. అయితే ఈ విషయంలో ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.స్క్రిప్ట్ పనులు దాదాపు పూర్తయ్యాయి. అయితే షూటింగ్ మొదలు కావడానికి ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ చిత్రానికి క్లాప్ పడవచ్చు.

ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే ఎడ్వంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. ఎక్కువ భాగం అడవుల్లోనే షూటింగ్ జరగనుంది. మొత్తంగా చూస్తే, మహేష్-రాజమౌళి కాంబో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకి మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనా.

Leave a comment

error: Content is protected !!