పూరీ జగన్నాథ్ ‘బాచీ’ చిత్రంలో ఒక చిన్న రోల్ చేసిన గాయకుడు, సంగీత దర్శకుడు రఘుకుంచె .. ఆ తర్వాత చాలా మంది నటులకు డబ్బింగ్ కూడా చెప్పాడు. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో కూడా నటించాడు. అయితే ఈ ఏడాది ‘పలాస 1978’ చిత్రంలో ఏకంగా విలన్ పాత్ర పోషించి అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు తాజాగా రఘు హీరోగా కూడా ప్రమోట్ అవుతున్నాడు. సినిమా పేరు ‘కథానళిని’. మే 21, 1991 లో జరిగిన కథగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఇందులో మురుగన్ అనే పాత్ర పోషించబోతున్నాడు రఘు కుంచె. 29 ఏళ్లుగా జైలులో మ‌గ్గిన ఒక స్త్రీ ఎమోష‌న‌ల్  జ‌ర్నీ ఈ సినిమా క‌థ‌. ఆ క్యారెక్టర్ ను ఒక ప్రముఖ హీరోయిన్ చేయ‌నుండ‌గా, మురుగ‌న్ అనే ఆమె భ‌ర్త పాత్రను ర‌ఘు కుంచె చేయ‌నున్నాడు. కొక్కిరిగ‌డ్డ మ‌హేంద్ర దర్శకత్వంలో ..  గోగో మూవీస్ బ్యానర్ పై   తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో ఈ సినిమా రూపొంద‌నుంది.

 

Leave a comment

error: Content is protected !!