Raghava Lawrence : ప్రముఖ నిర్మాత కోనేరు సత్యనారాయణ , దర్శకుడు రమేష్ వర్మ కలిసి మరోసారి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోగా రాఘవ లారెన్స్ నటించనున్నారు. లారెన్స్ కు ఇది 25వ చిత్రం కావడం విశేషం. రాక్షసుడు, ఖిలాడి చిత్రాల తర్వాత కోనేరు సత్యనారాయణ, రమేష్ వర్మ కలయికలో ఇది మూడో చిత్రం.

ఏ స్టూడియోస్ ఎల్ఎల్‌పి, నీలాద్రి ప్రొడక్షన్స్, హావ్విష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. “బిగ్ యాక్షన్ అడ్వెంచర్ బిగిన్స్” అనే టైటిల్‌తో ప్రకటించిన ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. రాఘవ లారెన్స్ పోస్టర్‌లో కనిపించిన శాడో అవతార్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. లారెన్స్ ఇటీవల వరుస విజయాలతో ఉన్నారు. దాంతో, ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకు అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. లారెన్స్ పాన్-ఇండియా లెవెల్‌లో విశేష గుర్తింపు తెచ్చుకోవడం ఈ ప్రాజెక్ట్‌ను మరింత ప్రతిష్టాత్మకంగా మార్చింది.

కోనేరు సత్యనారాయణ తన కెరీర్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. రమేష్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూడో ప్రాజెక్ట్, ఇప్పటి వరకు చేసిన చిత్రాల కన్నా పెద్దదిగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ 2024 నవంబర్‌లో ప్రారంభం కానుండగా, 2025 సమ్మర్‌లో విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

Leave a comment

error: Content is protected !!