Tollywood : ఎస్ వి క్రియేషన్స్ బ్యానర్ పై తెలుగు, బంజారా భాషల్లో విడుదల కానున్న చిత్రం రాధేకృష్ణ. ఎస్ ఎస్ సైదులు హీరోగా, భ్రమరాంబిక మరియు అర్పిత లోహి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇస్మాయిల్ షేక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఎం ఎల్ రాజా సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీకి ఊడుగు సుధాకర్ నిర్మాత. లేటెస్ట్ గా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు బెక్కం వేణుగోపాల్, రామ్ తల్లూరి, హీరో సోహెల్ మరియు ఆటో రాంప్రసాద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత రామ్ తల్లూరి, ఈ సినిమా తమ జిల్లాలో చిత్రీకరించబడిందని, టీజర్, పాటలు చాలా బాగున్నాయని అభిప్రాయపడ్డారు. కొత్త వారిని ప్రోత్సహించడం ద్వారా మరింత మంచి సినిమాలు వస్తాయని ఆయన అన్నారు. ఈ సినిమా నిర్మాతకు ఆర్థికంగా లాభదాయకంగా ఉండాలని, నటీనటులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

Leave a comment

error: Content is protected !!