అల్లు అర్జున్ కెరీర్ లో ఒన్ ఆఫ్ ది బెస్ట్ గ్రాసర్స్ గా నిలిచిన చిత్రం ‘రేసు గుర్రం’. సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో .. బన్నీ స్టైలిష్ పెర్ఫార్మెన్స్ కు తోడు .. బ్రహ్మీ కామెడీ ,  యస్.యస్ తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి హైలైట్స్ గా నిలిచాయి. ఇక  ఈ సినిమాకు అదిరిపోయే స్ర్కిప్ట్ అందించాడు స్టార్ రైటర్ వక్కంతం వంశీ. ఇప్పుడు మరోసారి వీరి ముగ్గురి మ్యాజిక్ రిపీట్ కానుందని వినికిడి.

చిత్ర వర్గాల నుంచి అందుతోన్న సమాచారం ప్రకారం.. సురేందర్‌ ప్రస్తుతం దర్శక రచయిత వక్కంతం వంశీతో కలిసి బన్నికి ఓ అదిరిపోయే కథను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ‘రేసుగుర్రం’కు కథను అందించింది కూడా వంశీనే అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో బన్ని కోసం పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌ను సిద్ధం చేయిస్తున్నారట ఆయన. ఇప్పటికే దీనికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే ‘పుష్ప’, ‘ఐకాన్‌’ చిత్రాలు పూర్తయిన వెంటనే అల్లు అర్జున్‌తో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని లక్ష్యంగా పెట్టుకున్నారట సురేందర్‌ రెడ్డి. మరి ఇప్పుడీ ట్రయో ఏ రేంజ్ లో మ్యాజిక్ చేయబోతారో చూడాలి.

 

 

Leave a comment

error: Content is protected !!