ఈ ఏడాది ఆరంభంలోనే అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో సూపర్ హిట్టు బోణీ కొట్టింది అందాల పూజా హెగ్డే. అందులో బుట్టబొమ్మగా ఆమె అభినయించిన తీరుకు సౌత్ జనం ఫిదా అయ్యారు. ప్రస్తుతం  అమ్మడు ప్రభాస్ ఓ డియర్ లోనూ, అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ లోనూ కథానాయికగా నటిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఈ రెండు చిత్రాల షూటింగ్స్ కుంటుపడ్డాయి. ఇక ఇప్పుడు తాజాగా పూజా ఒక చిత్రానికి కమిట్ మెంట్ ఇచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో హను రాఘవపూడి ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందులో హీరోగా మలయాళ యంగ్ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు. ఇక కథానాయికగా పూజా హెగ్డే ను ఎంపిక చేశాడట హను. 

‘మహానటి’ తర్వాత దుల్కర్  నటించబోయే రెండో స్ట్రైట్ తెలుగు సినిమా ఇదే అవడం విశేషం. ఎర్లియర్ గా అతడు నటించిన తమిళ, మలయాళ బైలింగ్విల్ ‘కణ్ణుమ్ కణ్ణుమ్ కొల్లైయడిత్తాల్’ తెలుగులో ‘కనులు కనులను దోచాయంటే’ గా విడుదలై…. మూడు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. ఇక పూజా హెగ్డే నటించిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం మలయాళంలో కూడా విడుదలై… అక్కడ కూడా మంచి సక్సెస్ నమోదు చేసుకుంది. అందుకే ఈ సినిమాను మలయాళంలో కూడా విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడు హను రాఘవపూడి. అతి త్వరలోనే సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ సినిమా ఏ రేంజ్ సినిమా అవుతుందో చూడాలి.  

Leave a comment

error: Content is protected !!