Prashanth Varma : బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కూడా ప్రారంభమైంది. కానీ, ఇటీవల సోషల్ మీడియాలో ఈ చిత్రం రద్దయిందనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో చిత్ర బృందం స్పందించింది.  సృజనాత్మక విభేదాల వల్ల సినిమా ఆగిందనే వార్తలు పూర్తిగా అవాస్తవమని, స్క్రిప్ట్ పనులు పూర్తి అయ్యాయని, ఇటీవలే ఫొటోషూట్, ప్రోమో షూట్ కూడా జరిగాయని స్పష్టం చేసింది.

ఈ ప్రోమో జూన్ చివరి వారంలో విడుదల కానుంది. అదే సమయంలో సినిమా టైటిల్ తో పాటు మరిన్ని వివరాలు కూడా వెల్లడిస్తారని చిత్ర బృందం తెలిపింది.”హనుమాన్” సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిన ప్రశాంత్ వర్మ ఈ సినిమాతో ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాలి.

Leave a comment

error: Content is protected !!