Prashanth neel : ప్రస్తుతం తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ ఏంటంటే స్టార్ హీరో అజిత్ , ప్రశాంత్ నీల్ కలిసి పని చేయబోతున్నారనే వార్త. అవును, నిజమే.. ‘కె.జి.ఎఫ్’ సిరీస్, సలార్ 1’ మూవీస్ తో భారీ విజయాలు అందుకున్న ప్రశాంత్ నీల్… తన తదుపరి ప్రాజెక్ట్‌లో అజిత్‌ను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం, ఈ ఇద్దరు స్టార్స్ కలిసి ఒక సమావేశం నిర్వహించి, ఒక కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చించారని వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా.. అజిత్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెండు సినిమాలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఆ రెండు సినిమాల్లో ఒకటి ‘కె.జి.ఎఫ్’ యూనివర్స్‌తో ముడిపడి ఉంటుందని సమాచారం. ‘కె.జి.ఎఫ్’ సిరీస్ ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సిరీస్ భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ‘కె.జి.ఎఫ్ 3’ పై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి, ఈ సిరీస్‌లో అజిత్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడా లేక మరో కొత్త ప్రాజెక్ట్‌తో వస్తాడా అన్నది తెలియాల్సి ఉంది.

ప్రశాంత్ నీల్ ఇప్పుడు ‘సలార్’ సినిమా సూపర్ హిట్‌తో ఆనందంగా ఉన్నారు. త్వరలోనే ‘సలార్ 2’ కూడా ప్రారంభం కానుంది. అంతేకాకుండా, ఎన్టీఆర్‌తో కలిసి కూడా ఆయన ఒక సినిమా చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌ల తర్వాతే అజిత్‌తో కూడిన ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద, అజిత్ అండ్ ప్రశాంత్ నీల్ కలిసి పని చేయబోతున్నారనే వార్త కోలీవుడ్ జనాన్ని ఖుషీ చేస్తోంది.

Leave a comment

error: Content is protected !!